చక్ర తీర్ధం-జాబాలి తిర్ద్ధం

       చక్ర తీర్ధం

తిరుమలమిద స్వామివారు ఆలయానికి సుమారు 5 కి.మీ దూరంలో చక్ర తీర్ధం ఉంది. పద్మనాభుడు అనే విప్రుడు పన్నెండు సంవత్సరాలు తపస్సు చేయగా శ్రీ మన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. పద్మనాభుని కోరిక ప్రకారం కల్ఫంతం దాక జీవించమని అనుగ్రహించాడు. కానీ ఒక సారి రాక్షసుడొకడు పద్మనాభున్ని మ్రింగబోయాడు.పద్మనాభుడు హరిని ప్రాద్దిoచాడు.హరి చక్రాయుధాన్ని ప్రయోగించాడు.చక్రాయుధం రక్షసున్ని సంహరించిoది.పద్మనాభుడు ` సుదర్శనాన్ని ప్రశంసించాడు.లోకసంరక్షణార్ధం ఇక్కడే ఉంటాను. ఈ సరోవరానికి చక్రతిర్డ్డమనే ప్రసిద్ది వస్తుంది. ఈ తిర్ద్దంలో స్నానం చేసీ వారికీ రాక్షస భాధ లేదు అని అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు.
  ఈ చక్ర తిర్ద్ధంలో చక్రతీర్ధ ఆళ్వారు,క్షేత్రపాలకుడయిన హనుమంతుడు,లక్ష్మి నరసింహస్వామి మూర్తులున్నాయి.యతిశ్వరులు తపం చేసుకోవడానికి వీలుగా అనుకూలమయిన రెండు గుహలు కుడా ఉన్నాయి. శిధిలావస్టలోని గోపురం,శిధిల గృహం ఇక్కడ కనిపిస్తాయి.
 శ్రీవారు మొక్కోటి వృశ్చిక మాసం శుద్దద్వాదశి రోజు చక్రతిర్ధనికి `వెంచేస్తారు.అక్కడే చక్రత్తాఆళ్వారుకు,నరసింహస్వామికి, ఆంజనేయస్వామికి అభిషేక పుష్పలంకారాలు జరుగుతాయి.నివేదనం ,హారతి,గోష్టి అనంతరం స్వామి సన్నిధానం చేరుకొంటారు
                         జాబాలి తిర్ద్ధం
 


 తిరుమలకు వాయువ్యంగా 5 కి.మీ దూరంలో ఉన్న  జాబాలి తీర్ధం. ఈ తీర్ధమహిమ వరహః,స్కంద పురాణాలలో వర్ణితం.కావేరినది తీరంలోని ఒక బ్రాహ్మణుడు పాపాత్ముల సహవాసం చేసి పరమపాపి అయ్యాడు.అందువల్ల ఒక భేతాళుడు ఆ బ్రాహ్మణుని(దురాచారున్ని) పట్టి పీడించసాగాడు.దురాచారుడు తిరుగుతూ పూర్వజన్మ సుకృత విశేషం వల్ల జాబాలి తీర్ధంలో స్నానం చేశాడు.భేతాళుడు దురాచారున్ని వదిలి పెట్టాడు. దురాచారుడు అశ్చర్యపడి తీరంలోని జాబాలికి సమస్కరించగా ఆ తీర్ధ మహత్యాన్ని వర్ణించాడు.ఈ తీర్ధ స్నానం వల్ల పంచ మహాపాతకాలు నశిస్తాయని ప్రతీతి








No comments:

Post a Comment