గోగర్భం గుండు-తిరుమల తోటలు

                                         గోగర్భం గుండు


తిరుమల శ్రీవారి ఆలయంలో క్షేత్రపాలక `గుండు` అనే పేరుతో పెద్ద గుండ్రని రాయి ఉండేదే.ఈ గుండు రాత్రి వేళా లోపలి ప్రాకారంలో తిరుగుతూ ఆలయానికి కాపలా కాసేదట.కాని ఒకసారి చిన్న బాలకుడు లోపలే ఉండి పోవడం,చనిపోవడం సంభవించింది.క్షేత్రపాలక గుండు వల్ల ఈ అనర్ధం వచ్చిందని ఈ గుండును గోగర్భం దగ్గరకు తరలించారని స్తానికుల కధనం.తగాదాలు వచ్చేవేళా గుండు దగ్గర కర్పూరం వెలిగించి నిజం చెప్పే ఇక్కడ ఉండేదట


                       




  తిరుమల తోటలు

తిరుమలేశుని ఆకర్షణకు విగ్రహకర్షణ మాత్రం గాకుండా ఆభరణాలoకరణ,పుష్పాలంకరణ, వస్త్రంకరణలు కుడా దోహదం చేస్తాయి.ఈ పుష్పాలంకరణ కోసం తిరుమల మీద ఎన్నో తోటలు వెలిశాయి.వాటిలో మొదటిది అనంతాఆళ్వారు తోట.తోటల పేరుతో కనిపించే ప్రదేశాలు


1.యతిరాజనందనోద్యానవనం (ప్రస్తుతం ట్రావెలర్స్ బంగ్లా ఏరియా)

2.మహంతు తోట(ఆళ్వార్ చెరువుకు ఎగువ)

3.సురవరం తోట( పాప వినాశనం బస్సు మర్ఘంలో)


4. పెరిందేవి తోట( పాప వినాశనం కాలిదారిలో)

5.తాళ్ళపాక వారి తోట( గోగర్భండాం ఎగువన పారువేట మండపం దగ్గర)

6 రామభక్షి(రామ్ భగిచా)

7.ఫారంతోట

8..ఉత్తరాది వారి తోట

9.పాత పుష్కరణి తోట

10.జియ్యంగారి తోట

11 గద్వాల్ తోట

12. మైసూరు మహారాజా తోట

వీటిలో కొన్ని చాల మటుకు ఇప్పుడు లేవు.కొన్ని కొత్తవి వెలిశాయి.

No comments:

Post a Comment