ఘంటా మండపం



                                   శ్రీవారి ఆలయంలో సన్నిధి వీధిలో ఎత్తైన ప్రదేశంలో నాలుగు కాళ్ళ మండపం ఉంది .దీనికి ఘంటా మండపం అని పేరు .శ్రీవారి అర్చకులు ఉదయం సాయంత్రం ప్రధాన ద్వారం దగ్గరకు వచ్చి ఆలయం తలుపులు తెరిచే వేళా వారి రాకను స్పష్టం చేసే విధంగా `ఘంటలు `మ్రోగించేవారట .కాని ఈ సంప్రదాయం ప్రస్తుతం లేదు .ఇక్కడ H.M.T  గడియారం ఉండేది .ప్రస్తుతం `ధర్మోరక్షతి రక్షతః  అనే  కరేoటు కాంతి వలయం ఉంది .ఘంటా మండపానికి గొల్ల మండపం అని కుడా పేరు .ఆ గొల్ల పేరు తెలియదు కానీ తిరుమల మీద పాలు ,పెరుగు ,నేయి అమ్మి ఆ రాబడితో ఈ మండపాన్ని కట్టించిoదట ఇలాంటి మండపాలు రామేశ్వరం ,మధుర ,శ్రీరంగంలో కుడా కనిపిస్తాయి ఇప్పుడు ఇక్కడ రక్షకదళం గస్తీ ఉన్నది

No comments:

Post a Comment